Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చికి వెళ్లిన మహిళపై ఫాస్టర్ అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (12:35 IST)
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చర్చికి వెళ్లిన మహిళపై చర్చి ఫాస్టర్ అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలైన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం అధికార వైకాపాకు చెందిన ఓ కీలక నేతకు తెలియడంతో ఆ దారుణానికి రూ.40 వేలు వెలకట్టించాడు. ఈ దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంకు చెందిన ఓ ఫాస్టర్ చర్చికి వచ్చే వివాహితపై కన్నేశాడు. ఇంట్లో పని ఉందని తీసుకెళ్లి తాళాలేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు భర్తకు, తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు 7వ తేదీన ఇందుకూరుపేట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఫాస్టర్ వైకాపాలోని కీలక నేతను ఆశ్రయించారు. ఆయన కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలితో పాటు కుటుంబసభ్యులను బెదిరించారు. రూ.40 వేలు బాధితురాలికి, పోలీసులకు రూ.10 వేలు ఇచ్చేలా సర్పంచి ఆ పత్రంపై సంతకాలు చేయించారు. బాధిత కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments