ఆస్తి కోసం అంత్యక్రియలను ఆపేసారు.. ససేమిరా అంటున్న తల్లి, సోదరి.. రోదిస్తున్న భార్య

ఠాగూర్
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (10:20 IST)
ఆస్తి కోసం ఓ వ్యక్తి  అంత్యక్రియలను కన్నతల్లి, సోదరి ఆపేశారు. దీంతో గత రెండు రోజులుగా ఆ వ్యక్తి మృతదేహం ఇంటివద్దే ఉంటుంది. భర్త శవాన్ని చూసిన భార్య రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది. 
 
గిద్దలూరు పట్టణానికి చెందిన హయగ్రీవ శివాచారి (32) కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో భార్య, 3 సంవత్సరాల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన శివాచారి ఈ నెల 7న ఇంటిపై నుంచి కిందపడి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
భర్త మృతదేహాన్ని తీసుకొని 8వ తేదీన ఈశ్వరి గిద్దలూరులోని అత్తింటికి వచ్చింది. శనివారం వైశ్యాబ్యాంక్ వీధిలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ శివాచారి తల్లి, సోదరి తమ ఇంటి వద్ద శవాన్ని పెట్టవద్దంటూ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. బంధువులు కూడా ఆ ప్రాంతానికి రాలేదు. 
 
దీంతో ఆదివారం సాయంత్రం వరకు శవం వద్ద ఈశ్వరి రోదిస్తూనే ఉంది. ఆదివారం సాయంత్రం సమాచారం అందుకున్న గిద్దలూరు అర్బన్ సీఐ సురేశ్ అక్కడికి చేరుకొని శివాచారి తల్లి, సోదరి, భార్యతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. అయితే ఆస్తుల విషయం తేలే వరకు అంత్యక్రియలు చేయబోమని వారు తేల్చిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments