Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగురాలిపై మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన మామ...

ఠాగూర్
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (09:22 IST)
సమాజంలోని కొందరు కామాంధులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. నిండు అంధురాలైన ఓ యువతిపై వరుసకు మామ అయ్యే ఓ కామమృగం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని పలాస మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలికి అదే గ్రామానికి చెందిన వరిశ భాస్కరరావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పేవాడు. మామ వరసయిన అతడు 7 నెలల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్దని నిరాకరించినా కల్ల బొల్లి మాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 
 
ఆ తర్వాత ఆ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో గత 22వ తేదీన ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. ఈ విషయం బయటపడటంతో కుటుంబ సభ్యులు భాస్కరరావును పిలిపించి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. 
 
ఇందులో తన తప్పు లేదని భాస్కరరావు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆదివారం బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కరరావు తనను గర్భవతిని చేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం