Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరేసుకున్న ప్రియుడు.. విషం సేవించిన ప్రియురాలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:10 IST)
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి ఉరేసుని ప్రాణాలు తీసుకుంటే, ప్రియురాలు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్, జ్యోతిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి గత 20 రోజులుగా కెపీహెచ్‌‍బీ కాలనీలోని ఒక వసతి గృహంలో ఉంటున్నారు. శ్యామ్ మాత్రం తన స్నేహితుడు కృష్ణ వద్ద కేపీహెచ్‌బీ కాలనీలోని ఏడో ఫేజ్‌లో ఉంటున్నాడు. ఇంటీవల కృష్ణ వద్దకు శ్యామ్ వచ్చాడు. కృష్ణ ఊరికి వెళ్లడంతో గది తాళాలు అడిగి తీసుకున్నాడు. 
 
మూడు రోజుల క్రితం శ్యామ్, జ్యోతిలు కలిసి కృష్ణ గదికి వచ్చారు. ఈ ఉదయం నుంచి రూమ్ నుంచి దుర్వాసన వస్తుండటంత చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడు చేరుకున్న పోలీసులు గదిని తెరిచి చూడగా, ఇద్దరూ విగతజీవులై కనిపించారు. శ్యామ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా, జ్యోతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు జ్యోతికి గతంలోనే వివాహం జరిగినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments