Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయమాటలు చెప్పి ఎనిమిదేళ్ల బాలికపై 80 యేళ్ళ వద్ధుడి అత్యాచారం

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (12:46 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై 80 యేళ్ల వృద్ధుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడికిపాల్పడ్డాడు. ఈ కామాంధుడు ఓ పూజారి కావడం గమనార్హం. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం మైనర్ బాలికపై పూజారి అత్యాచారం చేస్తుండగా, బాలిక తండ్రి కంటపడ్డాడు. ఆ తర్వాత ఆ పూజారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ వృద్ధుడికి భార్య, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కామాంధుడి పేరు ఘనశ్యామ్.
 
ఇదే విషయంపై ఆ బాలిక వద్ద ఆరా తీయగా, గత 3-4 రోజులుగా ఘనశ్యామ్ దాస్ బాబా తనని తన ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని బాధితురాలు తన తండ్రితో చెప్పింది. ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు, దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడని వాపోయింది. 
 
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి బర్రా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘనశ్యామదాస్‌ను అరెస్టు చేశారు. నిందితుడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనశ్యామదాస్ గంజాయి అమ్ముతూ ఖర్చులు సాగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం