Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోలో తిప్పుతూ బాలికపై 8 మంది అత్యాచారం

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:31 IST)
మహారాష్ట్రలోని పుణెలో బాలికపై 8 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తన స్నేహితుడిని కలిసేందుకు రైల్వే స్టేషన్లో 13 ఏళ్ల బాలిక రైలు కోసం ఎదురుచూస్తూ వుంది. ఈమె ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చింది. ఒంటరిగా రైల్వే స్టేషనులో కూర్చుని వుండగా ఆమెను ఓ ఆటోడ్రైవరు గమనించాడు.
 
కోవిడ్ కారణంగా ఆమె ఎక్కాల్సిన రైలు ఆరోజు రావడంలేదని ఆమెకి మాయమాటలు చెప్పాడు. ఈ రాత్రికి తన ఇంట్లో వుండమని ఆమెను ఒప్పించి ఆటోలో ఎక్కించుకున్నాడు. అలా వెళ్తూ వుండగానే సహచర ఆటోడ్రైవర్లకు సమాచారం ఇచ్చాడు. వారంతా ఆటో వెళ్తుండగా మధ్యలో ఎక్కారు.
 
అలా ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను ముంబై వెళ్లే బస్సు ఎక్కించి పారిపోయారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు గాలించారు. మొత్తం 8 మందిలో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments