Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోలో తిప్పుతూ బాలికపై 8 మంది అత్యాచారం

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:31 IST)
మహారాష్ట్రలోని పుణెలో బాలికపై 8 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తన స్నేహితుడిని కలిసేందుకు రైల్వే స్టేషన్లో 13 ఏళ్ల బాలిక రైలు కోసం ఎదురుచూస్తూ వుంది. ఈమె ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చింది. ఒంటరిగా రైల్వే స్టేషనులో కూర్చుని వుండగా ఆమెను ఓ ఆటోడ్రైవరు గమనించాడు.
 
కోవిడ్ కారణంగా ఆమె ఎక్కాల్సిన రైలు ఆరోజు రావడంలేదని ఆమెకి మాయమాటలు చెప్పాడు. ఈ రాత్రికి తన ఇంట్లో వుండమని ఆమెను ఒప్పించి ఆటోలో ఎక్కించుకున్నాడు. అలా వెళ్తూ వుండగానే సహచర ఆటోడ్రైవర్లకు సమాచారం ఇచ్చాడు. వారంతా ఆటో వెళ్తుండగా మధ్యలో ఎక్కారు.
 
అలా ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను ముంబై వెళ్లే బస్సు ఎక్కించి పారిపోయారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు గాలించారు. మొత్తం 8 మందిలో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments