Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదు రూపాయల కాయిన్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది..

ఐదు రూపాయల కాయిన్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది..
, మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:15 IST)
Five rupees coin
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటె వారిపై ఓ కన్నేసి ఉంచాలి. పట్టించుకోకపోతే అంతే సంగతులు. తాజాగా మైసూరులో అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. రూ.5 కాయిన్‌ చిన్నారి ప్రాణాలు తీసింది. 
 
వివరాల్లోకి వెళ్తే మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) ఇంట్లో ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. 
 
చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఖుషీ మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కళ్లముందు ఆడుకుంటూ ఉన్న బిడ్డ.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యా సంస్థలకు సెలవు - పరీక్షలు వాయిదా