Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (09:09 IST)
పవిత్ర తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కొండపై దారుణం జరిగింది. అరుణాచల దర్శనానికి వచ్చి తిరువణ్ణామలై కొండపై ధ్యానంలో నిమగ్నమైవున్న ఓ విదేశీ మహిళపై గైడ్ ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో భాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఫ్రాన్స్‌కు చెందిన 40 యేళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలై సందర్శన కోసం వచ్చారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ దారిలో ఓ ప్రైవేటు ఆశ్రమంలో ఆమె బస చేశారు. ఆలయం వెనుక ఉన్న మరో దారిలో కొండపైకి వెళ్ళి ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆమె స్థానికంగా ఉండే ఓ గైడ్ సాయం తీసుకునేవారు.
 
మూడు రోజుల క్రితం ఇలానే గైడ్ సాయంతో కొండపైకి వెళ్లి ధ్యానం చేస్తుండగా గైడ్ ఆమెపై లైంగికదాడిగి తెగబడ్డాడు. ఆ తర్వాత ఆ కామాంధుడు నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టుచేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments