Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బయట ఆడుకుంటున్న చిన్నారి - అపహరించి అఘాయిత్యం - ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు!

Advertiesment
crime

ఠాగూర్

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:33 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఇంటిలో ఒంటరిగా ఉన్న చిన్నారిని ఓ కామాంధుడు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పైగా, ఆ బాలిక ప్రైవేట్ భాగాలపై 28 కుట్లుపడ్డాయి. శరీరం మొత్తం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని కమలా రాజా ఆస్పత్రిలో ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. 
 
శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. నిద్ర కూడా పోవడం లేదు. ప్రైవేట్ భాగాలు, ముఖం, దవడలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి పడకపై పక్కకు కూడా తిరగలేని పరిస్థితిలో ఉంది. అంతగా ఆమె శరీరం గాయాలపాలైంది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన 17 యేళ్ల నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ దారుణ ఘటన ఈ నెల 22వ తేదీ రాత్రి జరిగింది. పొరుగునవున్న ఝాన్సీ జిల్లాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు ఆ బాలిక తాత, నానమ్మ ఆస్పత్రికి వెళ్లారు. దీన్ని అవకాశంగా తీసుకున్న పక్కింటిలోని కుర్రోడు ఈ పాడుపడినికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడుని బహిరంగంగా ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Budget 2025-26: ఏపీని ముంచేసిన వైకాపా.. బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ ఫైర్