అధిక మార్కులు వేయిస్తానని విద్యార్థిని అక్కడ తాకిన అబ్జర్వర్

Webdunia
గురువారం, 12 మే 2022 (09:01 IST)
డిగ్రీ పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని పట్ల అబ్జర్వర్ ఒకరు పరీక్షా హాలులో అసభ్యంగా ప్రవర్తించాడు. అధిక మార్కులు వేయిస్తానని, మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తానని ప్రలోభానికి గురిచేసి ఆ విద్యార్థిని వక్షోజాలను తాకాడు. దీంతో ఖంగుతిన్న ఆ విద్యార్థిని పరీక్ష ముగిసిన తర్వాత జరిగిన విషయం కాలేజీ యాజమాన్యానికి, కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ అబ్జర్వర్‌కు దేహశుద్ధి చేశారు. 
 
దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ కామాంధుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగింది ఈ పరీక్షలకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేస్తున్న మాధవరెడ్డి అనే వ్యక్తి అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం జరిగిన డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్ష సందర్భంగా ఈ ఘటన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments