Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఫోన్ కాల్, పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే గోడకేసి కొట్టింది, అంతే....

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:04 IST)
తల్లి దారుణానికి తెగబడింది. నెల కూడా నిండని పసికందును తన చేతులతో చంపేసింది. ఈ దారుణం డిసెంబర్ 9న జరిగింది. ఐతే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

 
కొట్టాయంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 21 ఏళ్ల మహిళకు నవంబరు నెలలో మగశిశువును ప్రసవించింది. ఐతే ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రి చుట్టూ తిరుగాల్సి వచ్చింది. మరోవైపు భర్త ఆమెను విడిచి దూరంగా వుంటున్నాడు.

 
దాంతో మరో యువకుడు ఈమెకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతుండగా బిడ్డ బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. దాంతో కోపం పట్టలేక ఆ శిశువు తలను గోడకేసి కొట్టింది. అంతే.. బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

 
ఐతే ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఐతే బిడ్డ మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అతడికి వెనుక పుర్రెపై గాయాలున్నట్లు తేలింది. దీనితో బిడ్డ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments