Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చియోపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - 53 మంది వలస కూలీల మృతి

చియోపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - 53 మంది వలస కూలీల మృతి
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:27 IST)
మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 53 మంది మృత్యువాతపడ్డారు. చియాపాస్‌లో వలస కూలీలతో వెళుతున్న ట్రక్కులారీ ఒకటి ఫుట్‌పాత్ డివైడర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది చనిపోగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
ఇదిలావుంటే, మృతులతోపాటు.. క్షతగాత్రులు అమెరికాకు చెందినవారిగా గుర్తించారు. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘోర ఘటన జరిగింది. ట్రక్కులో వంద మందికిపై వలస కూలీలకు పైగా ఉన్నప్పటికీ డ్రైవర్ అమితవేగంతో వాహనాన్ని నడిపారు. అది నియంత్రణ కోల్పోయి డివైడర్ గోడను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ : క్యాంపుల నుంచి పోలింగ్ కేంద్రాలకు