Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిమ్న కులం యువకుడితో ప్రేమ, కుమార్తెను హత్య చేసిన తల్లి

నిమ్న కులం యువకుడితో ప్రేమ, కుమార్తెను హత్య చేసిన తల్లి
, శనివారం, 4 డిశెంబరు 2021 (19:04 IST)
వరంగల్ జిల్లాలో మరో పరువు హత్య. జిల్లాలోని పర్వతగిరి గ్రామంలో నిమ్న కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉందనే ఆరోపణతో ఓ మహిళ తన తల్లి సహాయంతో తన కూతురిని హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.

 
ఈ ఘటన నవంబర్ 20 తెల్లవారుజామున జరుగగా ఆమె మరణాన్ని ఇద్దరూ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు రంగప్రవేశం చేసి హత్యలో వారి పాత్రను నిర్ధారించారు. కేసుపై సమగ్ర విచారణ తర్వాత వారిని అరెస్టు చేశారు.
 
 
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌ డీసీపీ వెంకటలక్ష్మి హత్య వివరాలను వెల్లడించారు. సమ్మక్క, బాబుల కుమార్తె ఉబ్బని అంజలికి 17 ఏళ్లు. ఆమె అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ తో ప్రేమను కొనసాగిస్తోంది. విషయం తెలిసిన యువతి తల్లి సమ్మక్క అతడితో సంబంధం మానుకోవాలని హెచ్చరించింది.

 
నిమ్న కులానికి చెందిన ప్రశాంత్‌తో అంజలి సంబంధాన్ని యువతి తల్లి-అమ్మమ్మ ఇష్టపడలేదు. వారు అతడితో వున్న సంబంధాన్ని తెంచుకోవాలని ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ అంజలి అందుకు నిరాకరించడంతో, సమ్మక్క- ఆమె తల్లి సమాజంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. 

 
దాంతో వారిద్దరూ యువతి ముఖంపై దిండుతో అదిమి గొంతు నులిమి చంపేసారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు’’ అని డీసీపీ తెలిపారు. సమ్మక్కపై అనుమానం రావడంతో మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌ ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. పోలీసుల బృందం ఆధారాలు సేకరించిన తర్వాత ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుడు పోలీసుల ముందు నేరం అంగీకరించారని డీసీపీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో... పార్టీల‌కు అతీతంగా నివాళి