Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లాడమంటే కాదంటున్నాడు, కోర్కె తీర్చకపోతే వీడియోలు బయటపెడతానంటున్నాడు: యువతి ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (09:26 IST)
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై రాజేంద్రప్రసాద్ అనే యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్ పల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 
పెద్దపల్లి జిల్లా అందుగుల పల్లికి చెందిన మాదిపల్లి అంజలి(24) గత మూడేళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితం తన అక్క వివాహంలో అంజలికి కరీంనగర్ శంకరం పేట మండలం గద్దె పక్క గ్రామానికి చెందిన ఉకంటి రాజేంద్రప్రసాద్(26)తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.

 
ఈ క్రమంలోనే నింధితుడు బాధితురాలిని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో న్యూ బోయిన్ పల్లి లోని ఓ హోటల్ గదిలో ఇరువురు పలుమార్లు శారీరకంగా ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే నిందితుడు ఫోటోలు, వీడియోలను తీశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకోవాలని అడిగినప్పుడల్లా నిందితుడు దాటవేస్తూ వస్తున్నాడు.

 
గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోనని, ఒకవేళ ఆమె ఇతరులను ఎవరినైనా వివాహం చేసుకుంటే తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments