విశాఖ - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పొగలు...

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (09:19 IST)
విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (ఏపీ ఎక్స్‌ప్రెస్) రైలులో ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున సంభవించింది. దీంతో రైలును వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఎస్-6 బోగీ నుంచి ఈ పొగలు వచ్చినట్టు గుర్తించారు. 
 
అయితే, రైలు బ్రేకులు జామ్ కావడం వల్లే పొగలు వచ్చాయని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. లోపాన్ని సరిచేస్తున్నామని, ఈ లోపాన్ని సరిచేసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో రెండు గంటలకు పైగా ఏపీ ఎక్స్‌ప్రెస్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు

కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments