Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడే కదా అని చేరదీస్తే ప్రియురాలిని లొంగదీసుకున్నాడు, ఆ తర్వాత?

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (18:07 IST)
ఆమెకు పెళ్ళి కాలేదు. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి తన మాట వింటుందన్న నమ్మకం. అందుకే తనతో పాటు పనిచేసే కొలీగ్‌కు దగ్గరైంది. అతనితో ఇంట్లోనే సహజీవనం పెట్టేసింది. సుమారు 3 యేళ్ల పాటు సహజీవనం సాగింది. ఇంతలో తన ప్రియుడి స్నేహితుడు పరిచయమయ్యాడు. అతను ఆమెని మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు.

 
ముంబైలోని విలేపార్లేలో నివాసముంటుంటోంది కేథరిన్. ప్రముఖ కాల్ సెంటర్లో ఆమె పనిచేస్తోంది. కాల్ సెంటర్లో పనిచేస్తోన్న కరోల్ మిస్కిట్టా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త సహజీవనం వరకు వెళ్ళింది. తండ్రి అప్పటికే అనారోగ్యంతో చనిపోవడంతో కేథరిన్ ఆడిందే ఆట..పాడిందే పాటలా తయారైంది.

 
దీంతో కొన్ని సంవత్సరాల పాటు కరోల్ మిస్కిట్టాతో సహజీవనం చేసింది. పెళ్ళి కాకుండానే కలిసి ఉంది. కాల్ సెంటర్‌కు ఒక కొత్త యువకుడు వచ్చాడు. అతను కరోల్ స్నేహితుడు. అతని ద్వారా కేథరిన్‌కు దగ్గరయ్యాడు సంజయ్. ఆమెకి మాయ మాయటలు చెప్పి, మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు.

 
మొదటి ప్రియుడికి తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని విషయం చెప్పకుండా దాచింది. పనిచేస్తున్న కొలిగ్స్ ఇచ్చిన సమాచారంతో కేథరిన్‌ను నిలదీసాడు ప్రియుడు. మాటా మాట పెరిగి కేథరిన్‌ను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

 
రెండవ ప్రియుడు ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి హత్యగా నిర్థారించుకుని కరోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేథరిన్ హత్యతో ఆమె తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. వృధ్యాప్యం పైబడడంతో ఆమెను ఆదుకునే వారే లేకుండా పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments