Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా భారీ విజయం.. 50 ఏళ్ల చరిత్రను తిరగరాసింది..

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (22:21 IST)
Team India
లండన్‌లోని.. ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా భారీ విక్టరీని అందుకుంది. ఈ 4వ టెస్టు విజయంతో… దాదాపు యాభై ఏళ్ళ చరిత్రను తిరగరాసింది కోహ్లీ సేన. ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు పై ఏకంగా 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది భారత జట్టు. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు కకావికలం అయ్యారు.
 
దీంతో తో 210 పరుగులకే… రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది ఇంగ్లాండ్ జట్టు. ఉమేష్ యాదవ్ ధాటికి… ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు వరుసగా పెవిలియన్ కు దారి పట్టారు. ఓపెనర్ బర్న్స్ 50 పరుగులు, ఆసీస్ హమీద్ 63 పరుగులు మరియు కెప్టెన్ రూట్ 36 పరుగులు మినహా ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. 
 
దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. యార్కర్లతో ఇంగ్లండ్ ని బెంబేలిత్తించిన బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఉమేష్ కి 2, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో హమీద్ (63) ఒక్కడే రాణించాడు. ఈ విజయంతో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. 5వ టెస్టు గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా ఈ సిరీస్ భారత్‌దే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

తర్వాతి కథనం
Show comments