Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరు జట్లను ఊరిస్తున్న ఓవెల్ టెస్ట్ మ్యాచ్ ఫలితం

ఇరు జట్లను ఊరిస్తున్న ఓవెల్ టెస్ట్ మ్యాచ్ ఫలితం
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:08 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవెల్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లనూ ఊరిస్తుంది. ఆతిథ్య ఇంగ్లండ్ ముంగిట 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. అదేసమయంలో టీమిండియా గెలవాలంటే చివరి రోజు పది వికెట్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఆట థ్రిల్లర్‌ను తలపించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మాత్రం 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం.
 
ఆ తర్వాత టీమిండియా 8 మ్యాచ్‌లు ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. వరుసగా గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) భారత్ ఘోర పరాజయాలను చవిచూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్‌లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో చిత్తయింది. 2018 పర్యటనలో 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 ఆలౌట్ - ఇంగ్లండ్ టార్గెట్ 368 రన్స్