Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డులు : 304 రన్స్ తేడాతో భారత్ విజయం!!

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (18:54 IST)
ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ రికార్డు స్థాయిలో 435 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సారా ఫోర్బ్స్‌ (41) టాప్‌ స్కోరర్. ఓర్లా (36) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, తనుజా కాన్వార్ 2.. టిటాస్ సధు, సయాలి, మిన్ను ఒక్కో వికెట్ తీశారు. పరుగులపరంగా భారత్‌ అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచ్‌ ఇదే. అంతకుముందు ఐర్లాండ్‌పైనే 2017లో 249 పరుగుల తేడాతో భారత మహిళా క్రికెట్ జట్టు గెలిచింది. 
 
ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయి కష్టాల్లో పడిన ఐర్లాండ్‌కు భారత్ కొండంత లక్ష్యం నిర్దేశించింది. 436 పరుగుల టార్గెట్‌ను ఛేదించాలంటే మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాలి. కానీ, భారత బౌలర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే ఐర్లాండ్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ గాబీ లూయిస్‌ (1), కౌల్టర్ (0) దారుణంగా విఫలమయ్యారు. మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్‌ మాత్రం ఉన్నంతసేపు కాస్త నిలకడగా ఆడింది. ఓర్లా (36)తో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించింది. మరోసారి భారత బౌలర్లు విజృంభించారు. ఓర్లాతోపాటు లారా డెలానీ (10), లేహ్‌ పాల్ (15), కెల్లీ (2) పెద్దగా ప్రభావం చూపించలేదు. 
 
మరోవైపు, టాస్‌ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌ నుంచే ఓపెనర్లు స్మృతి మంధాన (135), ప్రతీకా రావల్ (154) దూకుడు ప్రదర్శించారు తొలి వికెట్‌కు 233 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వన్డేల్లో భారత్ తరఫున వేగవంతమైన (70 బంతుల్లో) సెంచరీ సాధించిన బ్యాటర్‌గా స్మృతి నిలిచింది. మంధాన పెవిలియన్‌కు చేరిన తర్వాత రిచా ఘోష్‌ (59)తో కలిసి ప్రతీకా స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రిచా ఔటైనప్పటికీ తేజల్ (28), హర్లీన్‌ (15)తో కలిసి ప్రతీకా భారీగా పరుగులురాబట్టింది. ఈ క్రమంలో కెరీర్‌లోనే తొలి సెంచరీని నమోదు చేసింది. దీంతో తొలిసారి టీమ్‌ఇండియా 400+ స్కోరును నమోదు చేసింది. ఐర్లాండ్‌ బౌలర్లలో ఓర్లా 2.. కెల్లీ, ఫ్రేయా, డెంప్సీ తలో వికెట్‌ తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments