ముస్తాక్ అలీ ట్రోఫీ.. శ్రేయాస్ అయ్యర్ అదుర్స్.. 7 ఫోర్లు, 15 సిక్సర్లతో రికార్డ్

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:16 IST)
ఇండోర్‌లో జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రోజున సిక్కింతో జరిగిన టీ20లో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. తన బ్యాటుకు పనిపెట్టి 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్లు సాధించాడు. ఫలితంగా 147 పరుగులు చేసి భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 
 
ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిషభ్ పంత్ (128)ను అయ్యర్ అధిగమించి రికార్డు బద్ధలు కొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ విజృంభణతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 104 పరుగులకే కుప్పకూలి ఓటమిని చవిచూసింది. 
 
అంతకుముందు ఇదే ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా కేవలం 61 బంతుల్లోనే అజేయ శతకం బాదేశాడు. అంతేగాక దేశవాళీ టీ20లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. గ్రూప్‌-సిలో భాగంగా సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రైల్వేస్‌జట్టు ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులుండగానే గెలుపును నమోదు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments