Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా చేతిలో ఓటమి: సెలెక్టర్లు మూకుమ్మడి రాజీనామా.. రణతుంగ అంత మాటన్నాడే?

శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిన శ్రీలంక క్రికెటర్లను వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు శ్రీలంక జట్టు సెలక్షన్ కమిటీ సభ్యులంతా మూకుమ్మడి రాజీనామా చేశారు. మరోవైపు మూడో వన్డేలో

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (12:06 IST)
శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిన శ్రీలంక క్రికెటర్లను వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు శ్రీలంక జట్టు సెలక్షన్ కమిటీ సభ్యులంతా మూకుమ్మడి రాజీనామా చేశారు. మరోవైపు మూడో వన్డేలో టాస్ గెలిచినప్పటికీ కెప్టెన్ కపుగెదర తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.
 
ఆదివారం పల్లెకెలెలో జరిగిన మూడో వన్డేలో జట్టు సభ్యులంతా బౌలింగ్‌కు దిగుదామని చెప్పినప్పటికీ... కెప్టెన్ మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు దృష్టికి వెళ్లింది. శ్రీలంక జట్టు సారధి తరంగపై ఐసీసీ రెండు వన్డేల నిషేధం విధించడంతో... ఈ రెండు వన్డేలకు కపుగెదర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పటి నుంచి టాస్ విషయంలో భారత్‌దే పైచేయిగా వుంటూ వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా ఘనవిజయం సాధించి వన్డే సిరీస్ కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన శ్రీలంక క్రికెట్ యాజమాన్యం విచారణకు ఆదేశించినట్టు కనిపిస్తోంది.
 
మరోవైపు శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున్‌ రణతుంగ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత అభిమానుల్లా ప్రవర్తించవద్దని శ్రీలంక అభిమానులకు సూచించాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు మైదానంలోని ఫీల్డర్లపై బాటిళ్లు విసిరారు. దీంతో​మ్యాచ్‌ 35 నిమిషాల పాటు అంపైర్లు ఆటను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
 
లంక అభిమానులు కాస్త ఓర్పుతో ఉండాలి. సంయమనం పాటించాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయవద్దు. లంక ప్రజలు క్రికెట్‌ని ప్రేమిస్తారు. మేము మ్యాచ్‌ ఓడిపోయినప్పుడు వారెంతో బాధకు గురవుతారు. దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు. మనకంటూ మంచి చరిత్ర, సంస్కృతి ఉందంటూ కామెంట్ చేశాడు. రణతుంగ వ్యాఖ్యలపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments