Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపుతో జింబాబ్వే పర్యటనను ముగించిన భారత్... టీ20 సిరీస్ 4-1 తేడాతో కైవసం

వరుణ్
ఆదివారం, 14 జులై 2024 (23:03 IST)
భారత క్రికెట్ జట్టు తన జింబాబ్వే పర్యటనను గెలుపుతో ముగించింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైనా ఐదో మ్యాచ్‌లో కూడా భారత్ 42 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. మొత్తం 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆతిథ్య జింబాబ్వే జట్టును టీమిండియా బౌలర్లు 18.3 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూల్చారు. ముఖ్యంగా, పేసర్ ముఖేశ్ కుమార్ 4 వికెట్లతో జింబాబ్వేను దెబ్బతీశాడు. శివమ్ దూబే 2, తుషార్ దేశ్ పాండే 1, వాషింగ్టన్ సుందర్ 1, అభిషేక్ శర్మ 1 వికెట్ తీశారు.
 
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ 34, తదివనాషే మరుమని 27, ఫరాజ్ అక్రమ్ 27 పరుగులు చేశారు. ఓపెనర్ వెస్లీ మదివెరే (0) డకౌట్ కాగా... కెప్టెన్ సికిందర్ రజా (8), బ్రయాన్ బెన్నెట్ (10), జోనాథన్ క్యాంప్ బెల్ (4), వికెట్ కీపర్ క్లైవ్ మడాండే (1) విఫలమయ్యారు. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో చేజిక్కించుకుంది. 
 
అంతేకాదు, గెలుపుతో జింబాబ్వే పర్యటనను ముగించింది. శుభ్ మాన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా జట్టు ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ లో ఓటమిపాలైనప్పటికీ... ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో వరుస విజయాలను సాధించింది. టీమిండియా తదుపరి పర్యటన శ్రీలంకలో జరగనుంది. టీమిండియా ఈ నెల 27 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments