Webdunia - Bharat's app for daily news and videos

Install App

తటస్థ వేదికలపై నిర్వహించే ప్రసక్తే లేదు : పీసీబీ

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:23 IST)
తమ దేశంలో ఇతర దేశాలతో జరగాల్సిన క్రికెట్ సిరీస్‌లను తటస్థ వేదికలపై నిర్వహించే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆతిథ్యానికి తమ దేశం పూర్తిగా సురక్షితమని పేర్కొంది. 
 
'పాకిస్థాన్‌లో భద్రత పరిస్థితి సాధారణంగానే ఉంది. అంతర్జాతీయ జట్లకు ఆతిథ్యమిచ్చేందుకు అన్ని వసతులు ఉన్నాయి. ఇకమీదట తటస్థ వేదికలు మాకొద్దు' అని పీసీబీ అధికారి తెలిపాడు. 
 
కాగా, గత 2009లో పాక్‌లో శ్రీలంక బృందంపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో పర్యటనకు అన్ని జట్లు విముఖత చూపించాయి. తమ దేశంలో జరగాల్సిన సిరీస్‌లను యూఏఈలో పాక్‌ నిర్వహిస్తూ వచ్చింది. 
 
కొన్నేళ్ల తర్వాత మెల్లిగా పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మొదలైంది. పీఎస్‌ఎల్‌ కూడా జరుగుతోంది. అయితే ఇటీవల భద్రతా కారణాలతో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లు తమ పర్యటనల్ని రద్దు చేసుకోవడంతో పాక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.
 
మరోవైపు, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాలు టూర్‌ను రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ జట్టు పాకిస్థాన్ - తాలిబన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ఆడాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments