Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో క్రికెట్.. ఐపీఎల్ తరహాలో ఎంఎల్‌సి... సత్యనాదెళ్ల పెట్టుబడి

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (17:20 IST)
sathya Nadella
అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి అడుగులు పడ్డాయి.  2024 టీ20 వరల్డ్ కప్ పోటీలకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తోంది. 
 
తాజాగా అమెరికాలో ఐపీఎల్ తరహాలో టీ-20 లీగ్‌కు సిద్ధమవుతోంది. దీని పేరు మేజ్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సి). ఈ లీగ్ కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ పెట్టుబడులు పెడుతున్నారు.
 
వీరే కాకుండా పలువురు భారత సంతతి వ్యాపారవేత్తలు కూడా పెట్టుబడులకు ముందుకు రావడంతో  దాదాపు 120 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమకూరనున్నట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటిదాకా 44 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాగా, రాబోయే 12 నెలల్లో మరో 76 మిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో వస్తాయని అంచనా వేస్తున్నారు. 
 
దీనిపై మేజర్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, టోర్నీ నిర్వహణలో నిధులకు కొరత లేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా విపణిగా అమెరికా కొనసాగుతోందని, అలాంటి చోట ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభం కానుందని వివరించారు. 
 
సత్య నాదెళ్ల అమెరికా క్రికెట్ లీగ్ పై స్పందిస్తూ, తాను భారత్‌లో పుట్టిపెరగడం వల్ల క్రికెట్ అనేది అభిరుచుల్లో ఒకటిగా మారిందని తెలిపారు. అంతేకాదు, క్రికెట్ ఆడడం వల్ల, అందులోని పోటీతత్వం, సమష్టితత్వం పెరుగుతుందన్నారు. 
 
క్రికెట్‌లోని పరిస్థితులనే తన కెరీర్‌కు కూడా వర్తింపజేస్తానని, ఇప్పటిదాకా తాను ఆ సూత్రాలనే పాటించానని సత్య నాదెళ్ల వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments