Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా హెడ్ కోచ్‌గా మళ్లీ #RaviShastri: టీ-20 ప్రపంచకప్ దక్కేనా?

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (19:04 IST)
టీమిండియా హెడ్ కోచ్ పదవి మళ్లీ రవిశాస్త్రికే దక్కింది. కపిల్ దేవ్ నాయకత్వంలోని అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో తదుపరి కోచ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే.


ఈ ఇంటర్వ్యూల్లో క్రికెట్ సలహా కమిటీ మళ్లీ రవిశాస్త్రికే పట్టం కట్టింది. కెప్టెన్‌ కోహ్లీ బహిరంగంగానే రవిశాస్త్రికి తన మద్దతు ప్రకటించడంతో.. రవిశాస్త్రికి మళ్లీ కోచ్ పదవి వరించింది. 
 
ఇక కొత్త కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు. అలాగే భారత్ ఆతిథ్యమిచ్చే 2021 ట్వంటీ-20 ప్రపంచ కప్ వరకు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ భారత ఆటగాళ్లపైన, ఇతర అన్ని అంశాలపై రవిశాస్త్రికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. 
 
కాగా, రవిశాస్త్రి కోచ్ సారథ్యంలోనే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను భారత్ కోల్పోయింది. ఇక రెండేళ్ల పాటు కొనసాగే రవిశాస్త్రి, టీ-20 ప్రపంచ కప్‌నైనా సంపాదించిపెడతాడో లేదో అనేది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments