Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ వన్డే: ఫించ్ సెంచరీ... భారత్ టార్గెట్ 294 పరుగులు

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తన ప్రత్యర్థి భారత్ ముంగిట 294 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సె

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (17:37 IST)
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తన ప్రత్యర్థి భారత్ ముంగిట 294 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 293 పరుగులు చేసింది. 
 
ఒక దశలో 300లకు పైగా సునాయాసంగా సాధిస్తుందనుకున్నా.. చివర్లో భారత బౌలర్లు కంగారూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఓపెనర్లు ఫించ్, వార్నర్ (42) తొలి వికెట్‌కు 70 పరుగులు, ఫించ్, స్మిత్ రెండో వికెట్‌కు 173 పరుగులు జోడించి ఆసీస్‌కు మంచి శుభారంభం కల్పించారు. 
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 220 రన్స్‌తో మూడొందలకు పైగా స్కోరు ఖాయంగా కనిపించింది. అయితే 224 పరుగుల దగ్గర ఫించ్ ఔటవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 243 పరుగుల దగ్గర స్మిత్, మ్యాక్స్‌వెల్ (5) ఔటయ్యారు. 
 
కంగారు బ్యాట్స్‌మెన్లలో వార్నర్ (42), టీఎం హెడ్ (4), హ్యాండ్స్ కోంబ్ (3), ఎంపీ స్టాయినిస్ 27 పరుగులు చేయగా అగర్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండేసి వికెట్లు, చాహల్, పాండ్యాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. దీంతో, టీమిండియాకు 294 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఆసీస్ జట్టు నిర్దేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments