వైజాగ్‌లో 'మయాంక్' మాయ ... తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ (video)

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (15:13 IST)
భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ విశాఖపట్టణంలో మాయ చేశారు. ఈ టెస్టులో టెస్టులోనే డబుల్ సెంచరీ బాదాడు. అంటే టెస్టుల్లో తాను ఆడిన ఎనిమిదో ఇన్నింగ్స్‌లో తొలి డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ కర్నాటక కుర్రోడు క్రీజ్‌లో పాతుకుపోవడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. 
 
ప్రస్తుతం సౌతాఫ్రికాలో భారత్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా తొలి టెస్టు విశాఖపట్టణం వేదికగా బుధవారం ప్రారంభమైంది. ఇందులో కర్నాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అగర్వాల్ అద్భుతమైన రీతిలో డబుల్ సెంచరీ సాధించాడు. 
 
పట్టుమని 10 టెస్టుల అనుభవం కూడా లేని మయాంక్ దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్టుపై సెంచరీ సాధించడమే గొప్ప అనుకుంటే, అద్వితీయమైన రీతిలో 200 పరుగులు పూర్తిచేసి సగర్వంగా అభివాదం చేశాడు. దూకుడుకు సంయమనం జోడించి, అద్భుతమైన టెక్నిక్ మేళవించి సఫారీ బౌలర్లను ఆటాడుకున్నాడు. 
 
మొత్తం 371 బంతులు ఎదుర్కొన్న మయాంక్.. 23 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 215 పరుగులు చేశాడు. మయాంక్ మాత్రం తన డబుల్ సెంచరీని 358 బంతుల్లో 22 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 200 పరుగులు తీశాడు. 
 
అలా తాను చేసిన తొలి సెంచరీనే డబుల్‌ సెంచరీ చేశాడు. మయాంక్ అగర్వాల్ 215 పరుగుల స్కోరు వద్ద పార్ట్ టైమ్ బౌలర్ డీన్ ఎల్గార్ బంతికి వెనుదిరిగాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా, హనుమ విహారి క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట మధ్యాహ్నం సెషన్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 436 పరుగులతో ఆడుతోంది. 
 
అంతకుముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ (176) సెంచరీ చేసిన విషయం తెల్సిందే. అలాగే, పుజారా 6, కోహ్లీ 20, రహానే 15 చొప్పున పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 2, మరో స్పిన్నర్ ముత్తుస్వామి సేనురాన్, పేసర్ ఫిలాండర్, ఎల్గార్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments