Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : న్యూజిలాండ్‌‍పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (22:14 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో 12 యేళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆరు బంతుల్లో మిగిలివుండగానే ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ (76) కెప్టెన్ ఇన్నింగ్స్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు చేసి తీవ్ర నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ 48, కేఎల్ రాహుల్ 34, శుభమన్ గిల్ 31, అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్యా 18, రవీంద్ర జడేజా (9 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడం మూడోసారి. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా 2013లో ఇంగ్లండ్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 63, బ్రాస్‌వెల్ 53 పరుగులతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 ఫర్వాలేదనిపించారు. విల్ యంగ్ 15, కేన్ విలియమ్సన్ 11, టామ్ లేథమ్ 14, మిచెల్ శాంట్నర్ 8 పరుగులు చేశారు. నాథన్ స్మిత్ ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు. 

కివీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు - భారత్ బ్యాటింగ్ 
 
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న అంతిమ పోరులో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు కళ్లెం వేశారు. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లలో ఎవరు కూడా చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కీలకమైన రెండు వికెట్లు తీయగా, వరుణ్ 2, షమీ, జడేజాలో ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
కివీస్ ఇన్నింగ్స్‌లో దారిల్ మిచెల్ 63, బ్రేస్వెల్ 53 (నాటౌట్), రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34, విల్ యంగ్ 15, కేన్ విలియమ్సన్ 11, లాథమ్ 14, కెప్టెన్ మైకేల్ శాంటర్న్ 8 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. నిజానికి తొలి నాలుగు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు ఆ తర్వాత కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్ భారీగా పరుగులు చేయలేక పోయింది. 
 
ఆ తర్వాత 252 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి 9 ఓవర్లలో 90 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 47, శుభమన్ గిల్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇందులో రోహిత్ శర్మ మూడు ఫోర్లు, ఐదు ఫోర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

తర్వాతి కథనం
Show comments