Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాంపియన్స్ ట్రోఫీ : కివీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు - భారత్ బ్యాటింగ్

Advertiesment
india new zealand

ఠాగూర్

, ఆదివారం, 9 మార్చి 2025 (19:14 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న అంతిమ పోరులో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు కళ్లెం వేశారు. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లలో ఎవరు కూడా చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కీలకమైన రెండు వికెట్లు తీయగా, వరుణ్ 2, షమీ, జడేజాలో ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
కివీస్ ఇన్నింగ్స్‌లో దారిల్ మిచెల్ 63, బ్రేస్వెల్ 53 (నాటౌట్), రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34, విల్ యంగ్ 15, కేన్ విలియమ్సన్ 11, లాథమ్ 14, కెప్టెన్ మైకేల్ శాంటర్న్ 8 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. నిజానికి తొలి నాలుగు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు ఆ తర్వాత కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్ భారీగా పరుగులు చేయలేక పోయింది. 
 
ఆ తర్వాత 252 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి 9 ఓవర్లలో 90 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 47, శుభమన్ గిల్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇందులో రోహిత్ శర్మ మూడు ఫోర్లు, ఐదు ఫోర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : కివీస్ రెక్కలు విరిచిన కుల్దీప్ యాదవ్