Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి వచ్చేస్తున్నా.. సగర్వంగా ఇంటికి బయలుదేరనున్న పాండ్యా.. ఎందుకు?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (08:55 IST)
భారత క్రికెట్ జట్టు సభ్యుల్లో ఒకడు హార్దిక్ పాండ్యా. ఈ హిట్టర్ ఓ ఆల్‌రౌండర్.. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ సత్తా చాటుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో పాండ్యా కూడా ఒకడు. కానీ, ఈ క్రికెటర్‌ను కేవలం వన్డేలు, ట్వంటీ20 సిరీస్‌లకు మాత్రమే సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇపుడు వన్డే, టీ20 సిరీస్ ముగియడంతో హార్దిక్ పాండ్యా సగర్వంగా స్వదేశానికి బయలుదేరనున్నాడు. 
 
పైగా, ఇటీవలే ఓ బిడ్డకు తండ్రి అయిన పాండ్యా... దాదాపు గత నాలుగు నెలలుగా తన బిడ్డకు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. అయితే, మంగళవారం జరిగిన మ్యాచ్‌ తర్వాత మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభిస్తుందని ఎంతమాత్రమూ ఊహించలేదన్నాడు. 
 
జట్టు కలిసికట్టుగా రాణించడంతోనే టీ-20 సిరీస్ లో గెలుపు సాధ్యమైనందని అన్నారు. వన్డే సిరీస్‌లో రెండు వరుస మ్యాచ్‌లను ఓడిపోయిన అనంతరం, తమకు మిగిలింది నాలుగు మ్యాచ్‌ల సిరీస్ అనుకున్నామని, అందుకు తగ్గట్టుగానే మూడు మ్యాచ్‌లలో వరుసగా గెలిచామని తెలిపిన పాండ్యా, ఇప్పుడు జట్టు సభ్యులంతా ఆనందంగా ఉన్నారని చెప్పాడు.
 
సిరీస్ మొదలైన తర్వాత తనకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనిపించలేదని, ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉందన్నాడు. ఇక ఇండియాకు వెళ్లి, తన బిడ్డతోనూ, కుటుంబ సభ్యులతోనూ కొంతకాలం సంతోషంగా గడుపుతానని చెప్పాడు. కాగా, ఆస్ట్రేలియాలో పర్యటన అనంతరం హార్దిక్, టీ-20 వరల్డ్ కప్‌తో పాటు ఐపీఎల్‌కు సిద్ధం కానున్నాడు.
 
నిజానికి దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్, ఆపై ఆస్ట్రేలియాతో వన్డేలు, టీ-20 సిరీస్‌ల అనంతరం హార్దిక్ కు విశ్రాంతిని ఇవ్వాలని భావించిన బీసీసీఐ అతన్ని టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments