Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిడ్నీ థర్డ్ టీ20 : భారత్ టార్గెట్ 187 రన్స్

సిడ్నీ థర్డ్ టీ20 : భారత్ టార్గెట్ 187 రన్స్
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:37 IST)
సిడ్నీలో జరుగుతున్న మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులుచేసింది. ఫలితంగా భారత్ విజయం సాధించాలంటే 187 రన్స్ చేయాల్సివుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ వాడా, మ్యాక్స్‌వెల్‌లు రాణించిన విషయం తెల్సిందే. 
 
వాడా 53 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాయంత్రం 80 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 54 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ కాగా, స్మిత్ 24, హెన్రిక్యూ 5, షార్ట్ 7, సామ్స్ 4 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 12 రన్స్ వచ్చాయి. ఫలితంగా 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, నటరాజన్, చావల్, ఠాకూర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థర్డ్ ట్వంటీ20 మ్యాచ్ : టాస్ గెలిచిన కోహ్లీ.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ - ఫించ్ డకౌట్