Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా క్రికెట్‌కు గుడ్‌బై

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. తొమ్మిదేళ్లపాటు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన 31 ఏళ్ల అవానా-2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో భారత్‌ తరఫు

Webdunia
బుధవారం, 18 జులై 2018 (19:15 IST)
ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. తొమ్మిదేళ్లపాటు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన 31 ఏళ్ల అవానా-2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో భారత్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు.


అవానా 62 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 29.23 సగటుతో 191 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అన్నీ ఫార్మాట్లకు అవానా గుడ్ బై చెప్పేశాడు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని.. తాను క్రికెట్ నుంచి తప్పుకునేందుకు సమయం ఆసన్నమైందని అవానా చెప్పుకొచ్చాడు. 
 
మరోవైపు మొహమ్మద్ కైఫ్ కూడా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన 12 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. లోయర్ ఆర్డర్‌లో జట్టును అనేకసార్లు ఆదుకున్న కైఫ్, ఫీల్డింగ్ చేసేటప్పుడు చిరుతలా కదిలేవాడు. మహ్మద్ కైఫ్ తన క్రికెట్ కెరీర్‌లో 13 టెస్టులు, 125 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక టెస్టుల్లో 624 పరుగులు చేశాడు. 
 
టెస్టు ఫార్మాట్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. 125 వన్డేల్లో 2753 పరుగులు సాధించగా... అందులో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ లేఖను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి కైఫ్ పంపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత?

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments