Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తా: యువరాజ్ సింగ్

2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని 2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. అంతవరకు రిటైర్మెంట్‌పై ప్రకటన

2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తా: యువరాజ్ సింగ్
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (17:57 IST)
2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని 2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు.

అంతవరకు రిటైర్మెంట్‌పై ప్రకటన చేసే అవకాశం లేదని చెప్పాడు. తన కెరీర్ తొలి ఆరేడేళ్లు మంచి ఫామ్‌లో సాగిందని.. అనంతరం టెస్టు మ్యాచ్‌లో అవకాశాలు రాలేదని చెప్పాడు. టెస్టులో అవకాశాలు వచ్చిన తరుణంలో క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. 
 
ప్రస్తుతానికి ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఈ టోర్నీలో రాణిస్తే 2019 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం లభించవచ్చునని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గత ఏడాది జూలై నుంచి ఏ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ యువరాజ్ సింగ్ తళుక్కుమనకపోవడంతో.. యువీ రిటైర్మెంట్ తీసుకుంటాడని మీడియాలో వస్తున్న వార్తలకు యువీ పై వ్యాఖ్యల ద్వారా చెక్ పెట్టాడు. ఫలితంతా ప్రపంచకప్‌లో ఆడే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు ప్రకటించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిట్నెస్ కోసం సురేష్ రైనా పాట్లు చూడతరమా? (వీడియో)