చెన్నై టెస్ట్ మ్యాచ్ : భారత్‌పై ఇంగ్లండ్ సానుభూతి.. ఫాలో ఆన్ లేకుండానే..

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:38 IST)
చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టుపై ఇంగ్లండ్ సానుభూతి చూపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండానే ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత్ ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, తప్పకుండా 378 పరుగులు చేయాల్సి వుంది. కానీ, 337 పరుగులకే ఆలౌట్ అయింది. అయినప్పటికీ భారత్‌ను ఫాలోఆన్ ఆడించలేదు.
 
అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో  578 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ 337 పరుగులకు ఆలౌట్ అయింది. 6 వికెట్ల‌కు 257 ప‌రుగుల‌తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన కోహ్లి సేన‌.. మ‌రో 80 ప‌రుగులు జోడించి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయింది. 
 
ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (85 నాటౌట్‌) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. అశ్విన్ (31) అవుటైన త‌ర్వాత అవ‌త‌లి వైపు బ్యాట్స్‌మెన్ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డంతో సుంద‌ర్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయాడు. 
 
ఇప్ప‌టికీ ఇంగ్లండ్ కంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. అయితే ఇంగ్లండ్ మాత్రం టీమిండియాను ఫాలోఆన్ ఆడించ‌కుండా రెండో ఇన్నింగ్స్ ఆడాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోవ‌డం విశేషం. అశ్విన్ బౌలింగ్‌లో బ‌ర్న్స్ (0) డ‌కౌట‌య్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అత్యంత విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోగ్యం...

వైకాపా లీగల్ సెల్ న్యాయవాది బాగోతం.. మహిళలతో అసభ్య నృత్యాలు..

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పీటీఐ నేత ఏమంటున్నారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments