Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ పైన టీమిండియా ఘన విజయం: భారత్ విజయానికి, కోహ్లి సెంచరీకి కావలసింది 5 పరుగులే, కానీ...

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (00:31 IST)
ప్రపంచ కప్ 2023 క్రికెట్ పోటీల్లో టీమిండియా జైత్ర యాత్ర సాగుతోంది. న్యూజీలాండ్ జట్టు నడ్డి విరిచి నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐతే మొన్న బంగ్లాదేశ్ జట్టుపై విరాట్ కోహ్లి చేసిన ఫీట్ మరోసారి న్యూజీలాండ్ జట్టుపైన పునరావృతం అవుతుందని అంతా ఉగ్గబట్టుకుని ఎదురుచూసారు. విషయం ఏంటంటే... బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించడానికి మరో 2 పరుగులు అవసరమైన సమయంలో కోహ్లి సెంచరీ సాధించడానికి 3 పరుగులు కావల్సి వచ్చింది. ఆ సమయంలో కోహ్లి సిక్సర్ కొట్టడంతో అటు జట్టు విజయం ఇటు కోహ్లి సెంచరీ రెండూ ఒకేసారి జరిగాయి. ఇలాగే న్యూజీలాండ్ జట్టుతో తలబడిన కోహ్లికి అదే వరస వచ్చింది.

టీమిండియా విజయానికి 5 పరుగులు కావాలి, కోహ్లి సెంచరీ చేయడానికి కూడా 5 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి వున్నాడు. హెన్రీ వేసిన బంతిని భారీ షాట్ కొట్టాడు. ఐతే బౌండరీ లైన్ వద్ద వున్న ఫిలిప్స్ క్యాచ్ పట్టడంతో కోహ్లి సెంచరీ తృటిలో చేజారిపోయింది. దీనితో టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ వెంటనే జడేజా ఫోర్ కొట్టడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. 
 
274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాట్సమన్లు రోహిత్ శర్మ-శుభమన్ గిల్ 11.1 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్ శర్మ ఎప్పటిలాగే దూకుడుగా ఆడాడు. 40 బంతుల్లో 4x4, 4x6లతో 46 పరుగులు చేసాడు. దురదృష్టవశాత్తూ ఫెర్గూసన్ వేసిన బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తగలడంతో అది వికెట్లకు గిరాటేసింది. దీనితో రోహిత్ పెవిలియన్ దారిపట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి.. కివీస్ బౌలర్ల బౌలింగును కొద్దిసేపు ఆకళింపు చేసుకున్నాడు. పరుగులు తీయకుండా ఆచితూచి వ్యవహరించాడు. ఇంతలో 14వ ఓవర్లో గిల్ 26 పరుగుల వద్ద మళ్లీ ఫెర్గూసన్ బౌలింగులో ఔటవ్వడంతో న్యూజీలాండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో చంద్రబాబు.. అమరావతికి 45 కేంద్ర కార్యాలయాలు

తాను పడిన కష్టాల కంటే... ప్రస్తుత పరిస్థితి పెద్దదేమీ కాదులే : మాజీ సీఎం కేసీఆర్

హత్రాస్ బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ

బుల్లెట్ బండికి దారి ఇవ్వలేదని ఆటో వాలాను హాకీ కర్రతో చితకబాదిన ఓ యువతి..

సంక్షోభంలో బీఆర్ఎస్.. కాంగ్రెస్‌లోకి ఆరు ఎమ్మెల్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments