Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలాసలో జేసీబీతో కరోనా మృతదేహాన్ని తరలించిన అధికారులు.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (15:07 IST)
JCB
శ్రీకాకుళంలో ఘోరం జరిగింది. కరోనాతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం జేసీబీతో తరలించారు. ఏపీ, శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రభుత్వ అధికారులు డోర్ టూ డోర్ హెల్త్ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మున్సిపాలిటీకి చెందిన ఓ మాజీ ఉద్యోగి(72)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అతను ఇటీవలే చనిపోయాడు. అయితే ఆ వృద్ధుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు జేసీబీ మిషన్‌లో తరలించారు. 
 
ఈ దృశ్యాలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అధికారులేమో పీపీఈ కిట్లు ధరించి ఉన్నారు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారం కాస్త ఏపీ సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఆయన ఇది అమానవీయ చర్య అని సీఎం పేర్కొన్నారు. 
 
మృతదేహాన్ని జేసీబీలో తరలించేందుకు ప్లాన్ చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్.. పలాస మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్ ఎన్ రాజీవ్‌ను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments