Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త రకం కరోనా... జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదు: డబ్ల్యుహెచ్ఓ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (20:30 IST)
బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చి యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) మరోమారు హెచ్చరించింది. కొత్త రకం కరోనా వైరస్ విషయంలో కూడా ఇప్పటి వరకూ మహమ్మారి కట్టడికి అనుసరిస్తున్న జాగ్రత్తలనే పాటించాలని, జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరించింది. 
 
ఈ కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటి దాకా అదుపు తప్పలేదని, ఇంత కాలం పాటించినట్లుగానే కరోనా జాగ్రత్తలు పాటిస్తే కొత్త రకం కరోనా వైరస్ ను సమర్ధంగా తిప్పి కొట్టగలమని పేర్కొంది. అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించింది.
 
కాగా, బ్రిటన్‌‌లో కొత్త రకం కరోనా వైరస్ బయటకు వచ్చిందని తెలియడంతో అన్ని దేశాలు కూడా అప్రమత్తమైపోయాయి. కొత్తరకం కరోనా వైరస్ భారత్‌లోకి రాకుండా ఉండేందుకు భారత్, బ్రిటన్ మధ్య నడిచే విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. 
 
మరోవైపు గత రెండు వారాల్లో యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారు వైరస్‌ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కొత్త రకం కరోనా వైరస్ భారత్‌లోకి కూడా వచ్చేసిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments