Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ రైతుల్లో ఇద్దరు మృతి.. ఒకరికి కరోనా..

Webdunia
గురువారం, 20 మే 2021 (10:10 IST)
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పంజాబ్‌కు చెందిన ఇద్దరు రైతులు బుధవారం మృతి చెందారు. ఇందులో ఒకరికి కరోనా వైరస్‌ సోకిందని అధికారులు బుధవారం తెలిపారు. మృతులు బల్బీర్‌ సింగ్‌ (50), మహేందర్‌ సింగ్‌ (70) పంజాబ్‌లోని పాటియాలా, లుధియానా నివాసులని అధికారులు పేర్కొన్నారు.
 
ఢిల్లీ సరిహద్దుకు సమీపంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల బృందంలో వీరున్నారని పేర్కొన్నారు. బల్బీర్‌ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు సోనిపట్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జస్వంత్‌ సింగ్‌ పూనియా తెలిపారు. అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్‌ సోకినట్లు తేలిందని పేర్కొన్నారు.
 
అయితే, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి తమకు నివేదిక అందలేదని రాయ్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ బిజేందర్‌ సింగ్‌ తెలిపారు. మహేందర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, అతని మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియదని కుండ్లి ఎస్‌హెచ్‌ఓ రవికుమార్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments