Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కరోనాతో మరణిస్తే..?

Advertiesment
అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కరోనాతో మరణిస్తే..?
, మంగళవారం, 18 మే 2021 (21:29 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. అదేవిధంగా ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబానికి అదనంగా నెలకు రూ.2500 పింఛను ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
 
భర్త చనిపోతే.. భార్యకు పెన్షన్, భార్య చనిపోతే భర్తకు పెన్షన్, పెళ్లి కాని వ్యక్తులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆ పెన్షన్ అందించనున్నట్లు కేజ్రీవాల్ ఓ ప్రకటనలో తలిపారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు కూడా ఢిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. 
 
కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించిన లేదా తల్లి లేదా తండ్రి మరణించినా సందర్భంలో పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెలా రూ.2500 పెన్షన్ ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. వారి చదువులకు అయ్యే ఖర్చును పూర్తిగా ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలి ద్వాారా కరోనావైరస్ వ్యాపిస్తుంది, ఏం చేయాలి?