దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు : మృతులు 3874

Webdunia
గురువారం, 20 మే 2021 (09:58 IST)
దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే కరోనా కేసులు కాస్త పెరిగినా.. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. 
 
గడిచిన 24 గంటల్లో 2,76,070 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. నాలుగు రోజుల తర్వాత దేశంలో 4 వేలకు దిగువ మరణాలు రికార్డయ్యాయి. వైరస్‌ ప్రభావంతో కొత్తగా 3,874 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది. 
 
తాజాగా 3,69,077 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,57,72,400కు చేరాయి. ఇప్పటివరకు 2,23,55,440 మంది కోలుకున్నారు. 
 
మొత్తం 2,87,122 మంది బాధితులు మహమ్మారి సోకి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 31,29,878 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 18,70,09,792 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. 
 
మరో వైపు బుధవారం దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్‌ పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 20,55,010 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటివరకు 32,23,56,187 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments