దేశంలో మళ్లీ 11 వేలు క్రాస్ అయిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:09 IST)
దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు 11 వేలు క్రాస్ అయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 11,451 కొత్త కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 
 
తాజాగా 13,204 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 266 మంది బాధితులు వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. యాక్టివ్‌ కేసులు 262 రోజుల కష్టానికి చేరుకున్నాయని.. ప్రస్తుతం దేశంలో 1,42,826 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొన్నది.
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 0.42శాతంగా ఉన్నాయి. అలాగే, కరోనా వైరస్ బారినపడిన తర్వాత కోలుకునేవారి రేటు 98.24శాతానికి పెరిగిందని తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,43,66,987కు పెరిగింది. ఇందులో 3,37,63,104 మంది బాధితులు కోలుకున్నారు. 4,61,057 మంది బాధితులు మహమ్మారి బారినపడి ప్రాణాలు వదిలారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు

కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments