Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు - 15 మరణాలు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (11:30 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5676 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి 15 మంది చనిపోయారు. సుధీర్ఘ కాలం తర్వాత ఏకంగా ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. మంగళవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 5676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 37093 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కేరళలో 13745, మహారాష్ట్రలో 4667, ఢిల్లీలో 2336, తమిళనాడులో 2099, గుజరాత్‌లో 1932, హర్యానాలో 1928, కర్నాటకలో 1673, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 1282 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపు పాజిటివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
అదేవిధంగా ఈ వైరస్ బారినపడిన వారిలో 4,42,00,079 మంది కోలుకోగా, 24 గంటల వ్యధిలో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్‌, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది చనిపోయారు. వీటితో కలుపుకుని మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,31,000కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments