Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో భారీగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

covid - india
, గురువారం, 30 మార్చి 2023 (17:23 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ నమోదయ్యే కొత్త కేసుల్లో ఈ పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కూడా ఈ పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,016 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. అంటే, దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతేడాది అక్టోబరు 2వ తేదీన 3,375 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 
 
తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,12,692కి చేరింది. కాగా బుధవారంతో పోలిస్తే కొత్త కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక దేశంలో రోజూవారీ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షల రీ షెడ్యూల్ జారీ