దేశంలో కరోనా కేసులు పైపైకి... కొత్తగా మరో 45 వేల పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (09:58 IST)
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో 45 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,083 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 
 
దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,95,030కి చేరింది. అలాగే, నిన్న 35,840 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 460 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,37,830కి పెరిగింది. 
 
క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,18,88,642 మంది కోలుకున్నారు. 3,68,558 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. రిక‌వ‌రీ రేటు  97.53 శాతంగా ఉంది. కేర‌ళ‌లో నిన్న ఏకంగా 31,265 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 153 మంది ప్రాణాలు కోల్పోయారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments