Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్, కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేసినందుకేనా?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (13:05 IST)
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతున్నది. నగరాలు,పట్టణాలు దాటుకొని గ్రామాలకు కూడా సోకింది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిదుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి కూడా వైరస్ నిర్ధారణ అయ్యింది.
 
ప్రస్తుతం ఆయన తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరారు. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కరునాకర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు.
 
కరకంబాడి రోడ్డులోని గోవిందదామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు ఆయన దహన సంస్కారం చేసారు. తనను కలిసిన కార్యకర్తలు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలున్నవారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచనలు చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments