Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్, కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేసినందుకేనా?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (13:05 IST)
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతున్నది. నగరాలు,పట్టణాలు దాటుకొని గ్రామాలకు కూడా సోకింది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిదుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి కూడా వైరస్ నిర్ధారణ అయ్యింది.
 
ప్రస్తుతం ఆయన తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరారు. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కరునాకర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు.
 
కరకంబాడి రోడ్డులోని గోవిందదామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు ఆయన దహన సంస్కారం చేసారు. తనను కలిసిన కార్యకర్తలు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలున్నవారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచనలు చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments