Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో వరుస దాడులు.. 17మంది మృతి.. తాలిబన్ల చర్యే

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (12:59 IST)
ఆప్ఘనిస్థాన్‌లో చోటుచేసుకున్న వరుస దాడుల కారణంగా 17మంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్లకు, అధికారపక్షానికి మధ్య చర్చలు జరగాల్సిన తరుణంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి.

మంగళవారం ఉత్తర బాల్క్‌ ప్రావిన్స్‌లో ట్రక్‌ సూసైడ్‌ బాంబర్‌ దాడిలో ఇద్దరు అఫ్గాన్‌ కమాండోలు, ఒక పౌరుడు మరణించారు. మరో ఆరుగురు కమాండోలు, 35మంది పౌరులు గాయపడ్డారు. డజనుకుపైగా గృహాలు దెబ్బతిన్నాయి. 
 
ఈ దాడికి తామే కారణమని తాలిబన్‌ ప్రతినిధి జబుల్లా ముజాహిత్‌ ఇప్పటికే ప్రకటించారు. బాల్క్‌లోనే మరో ఘటనలో ఒక గన్‌మెన్‌ ఐదుగురిని కాల్చిచంపాడు. ఘోర్‌ ప్రావిన్స్‌లోని చెక్‌పాయింట్‌ వద్ద జరిగిన మరోదాడిలో 8మంది సైనికులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.
 
రాజధాని కాబూల్‌లో జరిగిన బాంబుదాడిలో ఒక పోలీసు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరోపక్క ఆప్ఘనిస్థాన్ ఆర్మీ జరిపిన వైమానిక, సైనిక దాడుల్లో 91మంది తాలిబన్లు మరణించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరో 50 మంది తాలిబన్లు గాయపడ్డట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments