Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి సురేష్‌కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి సురేష్‌కు కరోనా పాజిటివ్
, సోమవారం, 24 ఆగస్టు 2020 (17:07 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్‌ సోకింది. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు.
 
 స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు దవాఖానలో చేరానని ఆయన తెలిపారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లా తిరుచనూరులోని శ్రీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ -19 సంరక్షణ కేంద్రాన్ని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. 
 
రోగుల పట్ల సరైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. రోగుల నుంచి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వంట గదిని, మందుల పంపిణీ కేంద్రాన్ని, కరోనా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ఉద్యోగులతో మాట్లాడి వారి పని తీరును ప్రశంసించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ డేస్ సేల్..చౌక ధరకు మొబైల్ ఫోన్లు..