Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
, ఆదివారం, 23 ఆగస్టు 2020 (14:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేంగా వ్యాపిస్తోంది. ఈ కారణంగానే ఇక్కడ ప్రతి రోజూ పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే ఈ వైరస్‌కు సోకింది. 
 
ఆయన ప్రజాప్రతినిధి పేరు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తనకు కరోనా వైరస్ సోకినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, ప్రజలెవరూ అధైర్యపడవద్దని, తాను కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజల ముందుకు వస్తానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. తాను కోలుకునే వరకు తన వద్దకు ఎవరూ రావద్దని కోరారు.
 
ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. కరోనా సోకినప్పటికీ స్థానిక నేతలతో పాటు అధికారుల సాయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న వాహన రవాణాకు .. నేడు షుటింగులకు కేంద్రం అనుమతి