Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ల కోసం క్యూ కడుతున్న యువత

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (11:12 IST)
దేశంలో 15 నుంచి 18 యేళ్లలోపు యువతకు కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ టీకాలను వేయించుకునేందుకు యువత టీకా కేంద్రాలకు పోటెత్తుతోంది. ఫలితంగా గత మూడు రోజుల్లో ఏకంగా 1.24 కోట్ల మంది యువతీ యువకులు ఈ టీకాలను వేయించుకున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తుంది. అదేసమయంలో ఈ వైరస్ నుంచి రక్షించేందుకు వీలుగా 15-18 యేళ్ల మధ్య చిన్నారులకు కరోనా టీకాలు వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. 
 
అయితే, గత ముూడు రోజుల్లోనే 1,24,02,515 మంది చిన్నారులు ఈ టీకాలను వేయించుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మాన్సుక్ మాండవీయ వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 82,26,211 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా, వాటిలో 37,44,635 డోసులను కేవలం యువతకే వినియోగించారు. 
 
ఇదిలావుంటే, మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ తొలి దశ కార్యక్రమం గత యేడాది జనవరి 16వ తేదీన ప్రారంభించిన విషయం తెల్సిందే. తొలి దశలో కరోనా వారియర్లుగా పరిగణించిన వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయగా, రెండో దశలో 60 యేళ్లు పైబడిన వారికి, 45 యేళ్ళు పైబడి అనారోగ్యంతో బాధపడేవారికి టీకాలు వేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 యేళ్లు పైబడిన వారికి టీకాలు వేశారు. ఈ నెల 3 తేదీ నుంచి 15-18 యేళ్ల చిన్నారులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 148.58 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments