Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు.. ఒకే ఫ్యామిలీలో...

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (07:49 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 9 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒకేసారి ఇన్ని కేసులు వెలుగు చూడటంతో ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌, ఆదర్శ్ నగర్‌లో నివసించే ఓ కుటుంబ సభ్యులందరూ వారం రోజుల క్రితం సౌతాఫ్రికాకు వెళ్లి వచ్చారు. అయితే, కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో వీరందరికీ ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులే 9 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
దీంతో వీరిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో రాజస్థాన్ ప్రభుత్వం కర్ఫ్యూ తరహా పరిస్థితులను అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులతో కలుపుకుని దేశ వ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో ఏడు ఒమిక్రాన్ కేసులను గుర్తించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments